అల్లూరి జిల్లా తిమ్మాపురం వద్ద ఇసుక కోసం గల్లంతైన 4 వ్యక్తులు

Four people went missing while collecting sand in the Aeluru canal near Timmapuram in Alluri District. Rescue operations are underway Four people went missing while collecting sand in the Aeluru canal near Timmapuram in Alluri District. Rescue operations are underway

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని అడ్డతీగల మండలం తిమ్మాపురం వద్ద ఏలేరు కాల్వలో ఇసుక కోసం వెళ్లి ఈ నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీ పాలెం కి చెందినవారుగా గుర్తించారు . గల్లంతైన వ్యక్తులు భూషణం, జైబాబు, చిన్న గొంతయ్య, సిహెచ్ శ్రీను. ఈ మేరకు గజ ఈతగాళ్లు సహాయంతో పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇసుకను తీసుకు వెళ్లేందుకు వచ్చి కాలువలో ఈ నలుగురు గల్లంతైయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *