Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshCM Chandrababu | కార్యకర్తలకు దిశానిర్ధేశం..ఆ రెండు ముఖ్యమే

CM Chandrababu | కార్యకర్తలకు దిశానిర్ధేశం..ఆ రెండు ముఖ్యమే

-

Chat on WhatsApp

CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు వేదికను సందడిగా మార్చారు.

ముఖ్యమంత్రి మంత్రులు, జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమావేశమై, మండల అధ్యక్షుల నియామకాలలో ఏర్పడిన అసంతృప్తిని గుర్తిస్తూ, త్వరలో అందుకు తగిన స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

కాఫీ కబుర్లు” సమావేశంలో చంద్రబాబు పార్టీ శిక్షణ, నాయకత్వ నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు. ఎర్రటి ఎండలో, చెట్ల నీడలో శిక్షణ నిర్వహించిన ఎన్టీఆర్ కాలాన్ని గుర్తు చేసుకుంటూ, ఆధునిక సౌకర్యాలతో ఉన్న ప్రస్తుత తరానికి అనుగుణంగా నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

ALSO READ:Social Media Ban | ఆస్ట్రేలియా కొత్త చట్టం… 16 లోపు పిల్లలకు నిషేధం

పార్టీ భావజాలం, సిద్ధాంతాలు ప్రతి కార్యకర్తకు అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. అన్నదాత సుఖీభవ్, దీపం 2.0, స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.

బూత్ స్థాయిలో సమన్వయం, క్రమశిక్షణ, బలాబలాల విశ్లేషణ ప్రధానమని, సమర్థవంతమైన నాయకత్వం ఉన్న ప్రాంతాల్లో అధిక ఓట్లు రావచ్చని గుర్తుచేశారు.

చంద్రబాబు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యవస్థలను పునరుద్ధరించిన ప్రతిష్టను వివరించి, ప్రజలకు మంచి పనులను సమర్థవంతంగా చేరవేయడమే నిజమైన విజయమని, పని చేయడం మరియు ప్రజలకు చెబితే మరింత ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp