ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం — నిందితుడు అరెస్ట్


దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో విద్యార్థినిపై ఆమెకే క్లాస్‌మేట్ అయిన జీవన్ గౌడ (21) అనే యువకుడు క్యాంపస్‌లోని మగవారి వాష్‌రూమ్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం, ఈ ఘటన అక్టోబర్ 10న జరిగినా, ఆమె ఐదు రోజుల తర్వాత, అంటే అక్టోబర్ 15న ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలికి జీవన్ గతంలో క్లాస్‌మేట్ కాగా, అతను బ్యాక్‌లాగ్ కారణంగా చదువులో వెనుకబడ్డాడు. ఘటన జరిగిన రోజు లంచ్ బ్రేక్ సమయంలో జీవన్ గౌడ్ పదేపదే ఫోన్ చేసి కలవాలని ఆమెను కోరాడు. అక్కడికి వచ్చిన బాధితురాలిపై బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించగా, ఆమె లిఫ్ట్ వైపు వెళ్లింది. కానీ జీవన్ ఆమెను ఆరవ అంతస్తు వరకు వెంబడించి, అప్పుడు వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయం బాధితురాలు మొదట తన రెండు స్నేహితులకు తెలిపింది. అనంతరం నిందితుడు, తన చేసిన పాపాన్ని తుడిపెట్టాలన్న దుష్శ్రద్ధతో, బాధితురాలిని ఫోన్ చేసి “పిల్ కావాలా?” అని అడిగిన విషయమూ ఫిర్యాదులో పేర్కొంది. మొదట ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచించినా, చివరికి చెప్పి వారి సహకారంతో హనుమంతనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసి, జీవన్ గౌడను బుధవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరచగా, ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

పూర్తిగా కళాశాల క్యాంపస్‌లో జరిగిందని ఫిర్యాదులో పేర్కొనడంతో, కళాశాల యాజమాన్య తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *