సీఏ పరీక్షలు వాయిదా – ఐసీఏఐ కీలక ప్రకటన

Amid tensions with Pakistan, ICAI has postponed all CA exams. A new schedule will be announced soon. Amid tensions with Pakistan, ICAI has postponed all CA exams. A new schedule will be announced soon.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీఏఐ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. మే 9 నుంచి 14 మధ్య నిర్వహించాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ మరియు పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఇప్పటికే మే 3, 5, 7 తేదీలలో సీఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించబడ్డాయి. మిగిలిన గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. అలాగే ఫైనల్ పరీక్షలు కూడా ఇదే షెడ్యూల్‌లో ఉన్నాయి. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా మిగిలిన అన్ని పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఐసీఏఐ తెలియజేసింది. పరీక్షల యొక్క కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

ఐసీఏఐ వెల్లడించిన ప్రకటన ప్రకారం, పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన www.icai.org ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. ఎలాంటి అవాస్తవ వార్తలను నమ్మకుండా, అధికారిక నోటీసుల ఆధారంగానే ప్రణాళికలు రూపొందించుకోవాలని అభ్యర్థులకు సూచించబడింది.

ఈ నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్నప్పటికీ, భద్రత ప్రథమమన్న దృక్పథంతో ఐసీఏఐ ముందడుగు వేసింది. పరీక్షల వాయిదా కారణంగా విద్యార్థులు కలిగే ఒత్తిడి, అసౌకర్యాన్ని అర్థం చేసుకుంటున్నామని, త్వరలో స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. యుద్ధ వాతావరణం ప్రశాంతమవగానే పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *