ఘోర నిర్లక్ష్యం.. జగన్ ఘాటుగా ప్రశ్నలు

Jagan visited victims' families and accused the govt of negligence in Simhachalam tragedy, questioning poor arrangements and accountability. Jagan visited victims' families and accused the govt of negligence in Simhachalam tragedy, questioning poor arrangements and accountability.

సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉమ మహేశ్వరరావు, శైలజ కుటుంబాలను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. “ఇవే పరిస్థితులు తిరుపతిలో కూడా ఎదురయ్యాయి. లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా, కనీస ఏర్పాట్లు చేయలేదు. నీళ్లు, టాయిలెట్లు లేకుండా భక్తులను నిలబెట్టారు. ఇది మానవత్వానికి తలకిందులు చేసే పని,” అని జగన్ మండిపడ్డారు.

పది అడుగుల ఎత్తుగల గోడను నాలుగు రోజుల్లో నిర్మించారని, ఆ గోడలో కోలమ్స్ లేవని జగన్ వివరించారు. నిర్మాణంలో టెండర్లు కూడా పిలవకుండా సెక్యూరిటీ కోణంలో నిర్మించినట్టు ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల వల్లే ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నదన్నారు. ఆయన మాట్లాడుతూ, “చంద్రబాబు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతోంది. అయినా కూడా చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో తెలియదా?” అంటూ గట్టి ప్రశ్నలు వేశారు.

గతంలో కూడా తిరుమలలో లడ్డూ వివాదం, వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన అపశ్రుతులపై జగన్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని గుర్తుచేశారు. సింహాచలంలో చందనోత్సవం నాడు 7మంది చనిపోవడం, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవడం, కడపలో ఆశ్రమం ధ్వంసం—all these incidents are a result of diversion politics and irresponsibility, he said. అధికారులపై చర్యలు లేకపోవడమే వాళ్లకు భయం లేకుండా చేస్తోందని అన్నారు.

జగన్ మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం వర్షం పడుతుందని తెలిసినా ప్రజలను అక్కడికి అనుమతించారు. ఇప్పుడు ప్రాణాలు పోయాక తప్పు ఒప్పుకోవడం ఎవరికి ఉపయోగం?” అని నిలదీశారు. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం ప్రకటించడం వల్ల తప్పు నెరవేర్చినట్లు కాదు అన్నారు. “మేము అధికారంలోకి వచ్చాక మిగిలిన నష్టపరిహారాన్ని ఇవ్వగలమని హామీ ఇస్తున్నాం. గతంలో ఎల్.జీ పాలిమర్స్ ఘటనలో కూడా ఇలా సహాయం చేశాం” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *