Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోవూరులో అక్షరాస్యత ఉద్యమానికి ఘన ఆరంభం

కోవూరులో అక్షరాస్యత ఉద్యమానికి ఘన ఆరంభం

-

Chat on WhatsApp

కోవూరు పంచాయతీ పరిధిలోని ఐసిడీఎస్ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ స్థాయి అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య అభివృద్ధిని లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా కమ్యూనిటీ మొబలైజర్‌ల సమావేశం కూడా ఏర్పాటు చేయబడింది. వారి పాత్ర ప్రజల్లో చైతన్యాన్ని రేపడంలో కీలకమని అధికారులు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో అక్షరాస్యతను పెంపొందించేందుకు కమ్యూనిటీ మొబలైజర్లు ప్రధానంగా పనిచేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల మధ్య కోవూరు నియోజకవర్గాన్ని అక్షరాస్యత కార్యక్రమానికి మొదటిగా ఎంపిక చేయడం గర్వకారణమని స్థానికులు పేర్కొన్నారు. ఇది ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నారు. కలెక్టర్ ఆనంద్ చేసిన ఈ ఎంపికపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కోవూరు నియోజకవర్గంలో సుమారు 28 వేల మంది నిరక్షరాస్యులు ఉన్నారని, వారందరిని అక్షరాస్యులుగా మారుస్తూ సమగ్ర కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యావంతమైన సమాజం నిర్మాణమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp