Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshభారతి సిమెంట్ మైనింగ్ పేలుళ్లపై గ్రామస్తుల ఫిర్యాదు

భారతి సిమెంట్ మైనింగ్ పేలుళ్లపై గ్రామస్తుల ఫిర్యాదు

-

Chat on WhatsApp

వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం టి.సుంకేసుల గ్రామంలో మైనింగ్ పేలుళ్లతో ఇళ్లకు గండిపడుతోందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీ సిమెంట్ కంపెనీ నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ వల్ల ఇళ్ల గోడలు చీలిపోతున్నాయని, భద్రత లేకుండా జీవించాల్సి వస్తోందని వారు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై గ్రామస్తులు కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. గతంలోనూ అధికారులు తనిఖీ చేసినప్పటికీ ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో మళ్లీ ఫిర్యాదుకు వచ్చామని పేర్కొన్నారు. మైనింగ్ పేలుళ్ల ధాటికి చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

గత నెల 20న అధికారులు గ్రామాన్ని పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం బ్లాస్టింగ్ టెస్టింగ్ పరికరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఇప్పటికీ వాటిని అమలు చేయకపోవడం బాధాకరమని మండిపడ్డారు. ఇల్లు దెబ్బతినడంతో తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వాపోయారు.

ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ, మునుపటి తనిఖీ నివేదిక తమకు అందలేదని తెలిపారు. త్వరలోనే వివరాలు సేకరించి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యపై అధికారులు స్పందించాలని, గ్రామస్తుల జీవితాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

revanth reddy marks 20 years of political journey with emotional message

Revanth Reddy | ప్రజల విశ్వాసమే నా బలం.. రెండు దశాబ్దాల ప్రస్థానంపై రేవంత్...

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ప్రజా జీవితంలో సాగిన ఈ 20 ఏళ్ల ప్రయాణం...
- Advertisement -
Chat on WhatsApp