Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమహిళల భద్రత కోసం చిత్తూరు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు

మహిళల భద్రత కోసం చిత్తూరు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు

-

Chat on WhatsApp

చిత్తూరు జిల్లా పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ ఆదేశాల మేరకు “మీ కోసం – మీ రక్షణ మా బాధ్యత” అనే సూత్రంతో, బాలికలు, మహిళలు భద్రంగా ఉండేందుకు అనేక ముందడుగు చర్యలు తీసుకున్నారు. స్కూల్, కాలేజీల వద్ద భద్రతా తనిఖీలు (సెక్యూరిటీ ఆడిట్) నిర్వహించి, విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఈ భద్రతా తనిఖీల్లో భాగంగా, విద్యా సంస్థల పరిసరాల్లోని ప్రహరీ గోడలు, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. సీసీ కెమెరాలు లేని చోట్ల వెంటనే అమర్చాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల భద్రత కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవ్‌టీజింగ్, వేధింపుల వంటి ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, పోక్సో చట్టం వంటి విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థినులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందేందుకు 112, 1091, 181 వంటి నంబర్లను స్కూల్, కాలేజీల ప్రధాన గేట్లు, క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, బస్సు నిలయాలు, మహిళా హాస్టళ్ల వద్ద పోస్టర్ల రూపంలో ప్రదర్శిస్తున్నారు.

మహిళల భద్రత కేవలం పోలీసులే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు మహిళా భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చిత్తూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp