Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఆడమిల్లి ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన జర్మన్ బృందం

ఆడమిల్లి ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన జర్మన్ బృందం

-

Chat on WhatsApp

ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత పెరుగుతోంది. గ్రామ సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో, రైతు మలకలపల్లి వీర రాఘవయ్య జీవామృతంతో సాగు చేస్తున్న కొబ్బరి, కోకో, వక్క, పామాయిల్ పంటలను జర్మనీ దేశానికి చెందిన వ్యవసాయ నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను విశ్లేషించారు.

ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అర్థం చేసుకునేందుకు జర్మన్ బృందం ఆడమిల్లికి వచ్చి పంట పొలాలను సందర్శించింది. రైతు మలకలపల్లి వీర రాఘవయ్య రైతులకు ప్రేరణగా నిలిచారని, జీవామృతంతో సాగు చేయడం వల్ల మట్టిసారం పెరుగుతుందని జడ్పీ ఎన్‌ఎఫ్ నేచురల్ ఫార్మింగ్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విధానం భవిష్యత్‌లో అధిక దిగుబడికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఆర్టికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన పెంచేందుకు అధికారులు సూచనలు అందించారు. ఈ పద్ధతిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వ సహాయం అవసరమని రైతులు అభిప్రాయపడ్డారు.

స్థానిక రైతులు, కూటమి నాయకులు, మరియు అధికారులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం విధానాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఈ సందర్శన ద్వారా ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ గుర్తింపు పెరిగే అవకాశం ఉందని స్థానిక నాయకులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp