Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఅవంతి సీ ఫుడ్స్ కంపెనీ వద్ద గ్రామస్తుల నిరసన

అవంతి సీ ఫుడ్స్ కంపెనీ వద్ద గ్రామస్తుల నిరసన

-

Chat on WhatsApp

పెద్దనాపల్లి గ్రామానికి చెందిన మోర్త సుదర్శన్ రావు అనే యువకుడు అవంతి సీ ఫుడ్స్ కంపెనీలో సూపర్వైజర్ చెప్పిన పనిలో ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. కంపెనీకి సంబంధించిన సూపర్వైజర్ అతనిని ఈగలు, దోమల నివారణ మందు తెచ్చేందుకు పంపారు. ఈ క్రమంలో అతను ప్రమాదవశాత్తు ఒక స్తంభానికి ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.

అతను తీవ్రంగా గాయపడినప్పటికీ కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోలేదు. కనీసం తమ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయపడిన యువకుడిని కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యం అందించే సమయంలో, అతను ఈ రోజు కన్నుమూశాడు.

ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ పెద్దలు, స్థానికులు అవంతి సీ ఫుడ్స్ కంపెనీ ముందు నిరసన చేపట్టారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే యువకుడి ప్రాణం పోయిందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్థుల నిరసన కొనసాగుతోంది. కంపెనీ యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమం విరమించమని గ్రామస్థులు స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Amarnath Yatra 2026

Amarnath Yatra 2026 | అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 1.60 లక్షలు దాటిన...

Amarnath Yatra 2026: హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహను దర్శించేందుకు ఈ ఏడాది భక్తులు భారీగా తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోవడం విశేషం....
- Advertisement -
Chat on WhatsApp