Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeCrime Newsపాకాలలో 13 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్టు

పాకాలలో 13 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్టు

-

Chat on WhatsApp

పాకాల రైల్వే స్టేషన్‌లో భారీ గంజాయి రవాణా వ్యవహారం బయటపడింది. నిన్న ఉదయం 11:30 గంటలకు పోలీసులు ప్రత్యేక సమాచారంతో దాడి నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. సాన విష్ణుమోహన్ రెడ్డి (24), ఆర్. పాండియన్ (31) అనే ఇద్దరు వ్యక్తులు విజయవాడ నుండి మదురైకి గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు.

పోలీసులు అందుకున్న సమాచారం మేరకు, ముద్దాయిలు మొదట విజయవాడ నుండి మదురై వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, నిన్నటి రోజు మదురై వెళ్లే రైలు లేకపోవడంతో, వారు చిత్తూరు మీదుగా కాట్పాడి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో, పాకాల రైల్వే స్టేషన్‌లో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పాకాల ఇన్స్పెక్టర్ M. సుదర్శన్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో SI MN. సంజీవ రాయుడు, తహసీల్దార్ సంతోష్ సాయి, పాకాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల తనిఖీల్లో ముద్దాయిల వద్ద 13 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు గంజాయిని మదురైకి తరలించేందుకు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.

అరెస్టు చేసిన అనంతరం నిందితులను రిమాండ్ నిమిత్తం పాకాల కోర్టుకు తరలించారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాకాల పోలీసులు ఇలాంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

search operation for six missing fishermen called off off visakhapatnam coast

Visakhapatnam | మత్స్యకారుల జాడ కోసం నాలుగు రోజుల అన్వేషణ.. చివరికి?

Visakhapatnam: విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నాలుగు రోజుల పాటు నిరంతరంగా సాగిన అన్వేషణ అనంతరం ఇండియన్ నేవీ, కోస్ట్...
- Advertisement -
Chat on WhatsApp