Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeOthersఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ వైస్ కెప్టెన్ పై ఉత్కంఠ

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ వైస్ కెప్టెన్ పై ఉత్కంఠ

-

Chat on WhatsApp

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముహూర్తం దగ్గర పడుతోంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ప్రకటించనుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నా, వైస్ కెప్టెన్ పదవికి ఎవరు ఎంపికవుతారనే ఉత్కంఠ క్రికెట్ వర్గాల్లో నెలకొంది.

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన వెన్నునొప్పి గాయం నుంచి కోలుకుంటే, వైస్ కెప్టెన్ పదవికి అతడిని ఎంపిక చేస్తారనే సమాచారం వెలుగులోకి వచ్చింది. గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బుమ్రాను ఈ రోల్‌లో చూసిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. అయినా, అతని తాజా ప్రదర్శనను, నాయకత్వ సామర్థ్యాలను బట్టి ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.

మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ హయాంలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. కానీ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం జరిగింది. అయితే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన అద్భుత ప్రదర్శనతో, నాయకత్వ సామర్థ్యంతో బుమ్రా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకుని ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులోకి రావడం దాదాపు ఖాయమైంది. అయితే, టోర్నీ ముందు ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్లు తీసుకునే నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

పసిడిపై పశ్చిమాసియా యుద్ధ సెగ..

బిజినెస్ డెస్క్: ఈ ఏడాది ఆరంభంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా దిగొస్తూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి....
- Advertisement -
Chat on WhatsApp