Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతాటిపూడి జలాశయం గేటు తెరచి నీరు విడుదల

తాటిపూడి జలాశయం గేటు తెరచి నీరు విడుదల

-

Chat on WhatsApp

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం వరదనీటితో నిండిపోతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా నీటిమట్టం అధికం కావడంతో బుధవారం మధ్యాహ్నం జలాశయంలోని ఒక గేటు తెరిచి నీటిని విడుదల చేశారు.

నీటి పారుదల శాఖ అధికారులు గోస్తనీ నదిలోకి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తాటిపూడి ఇరిగేషన్ ఏఈ తమ్మి నాయుడు ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. జలాశయం నుంచి నీరు విడుదల కారణంగా గోస్తనీ నదిలో ప్రవాహం పెరిగినట్లు తెలిపారు.

నీటి విడుదల వల్ల నది తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రవాహం కారణంగా పంటల నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

ప్రజల భద్రత కోసం అధికార యంత్రాంగం నదీ పరిసర ప్రాంతాల్లో గస్తీ పెంచింది. తాటిపూడి జలాశయం స్థితి పై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp