Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeFilms Newsబోడుప్పల్‌లో జయ మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ప్రారంభం

బోడుప్పల్‌లో జయ మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ప్రారంభం

-

Chat on WhatsApp

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జయ మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ దానగళ్ళ అనిత యాదగిరి పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేయడంతో ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వహకులు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రి ప్రారంభించామని వివరించారు. ప్రత్యేకమైన వైద్య సదుపాయాలతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

హాస్పిటల్‌లో అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ స్రవంతి కిషోర్ గౌడ్, కార్పొరేటర్ అనిత యాదగిరి మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు ఇది ఒక గొప్ప ఆరాటమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం పేద ప్రజలకు వైద్య సేవ

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

పసిడిపై పశ్చిమాసియా యుద్ధ సెగ..

బిజినెస్ డెస్క్: ఈ ఏడాది ఆరంభంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా దిగొస్తూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి....
- Advertisement -
Chat on WhatsApp