Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఅమిత్ షాను పదవి నుండి తొలగించాలని లాయర్ల నిరసన

అమిత్ షాను పదవి నుండి తొలగించాలని లాయర్ల నిరసన

-

Chat on WhatsApp

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి భర్తరఫ్ చేయాలని అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు నిరసన చేపట్టారు.

లాయర్లు అమిత్ షా పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, వెంటనే ఆయనను హోం మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

లాయర్లు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి అమిత్ షాను పదవి నుండి తొలగించి, దేశ ప్రజల న్యాయపరమైన హక్కులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి రామ్, సెక్రటరీ నందిక శ్రీను, డి.బి. లోక్, పెయ్యల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లాయర్లు అధిక సంఖ్యలో హాజరై తమ నిరసనను వ్యక్తపరిచారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Pilgrims waiting during the temporary suspension of Chardham Yatra in Uttarakhand

Chardham Yatra  | భక్తులకు అలర్ట్.. చార్‌ధామ్ యాత్ర రెండు రోజులు బంద్

Chardham Yatra: ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భక్తుల యాత్రలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఇటీవల పునఃప్రారంభమైన చార్‌ధామ్ యాత్రకు మరోసారి తాత్కాలిక బ్రేక్ పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ...
- Advertisement -
Chat on WhatsApp