Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshగన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి సంచారం

గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి సంచారం

-

Chat on WhatsApp

గన్నవరం మండలంలోని మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఒక రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టినప్పుడు, ఉచ్చులో చిరుతపులి చిక్కుకుపోయింది.

రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూసినప్పుడు, ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుతపులి గమనించారు. ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు తీవ్రంగా షాక్‌కు గురయ్యారు.

మెట్లపల్లి గ్రామంలోని పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతంతో సన్నిహితంగా ఉన్నాయి. ఈ పరిసరంలో ఇంకా చిరుతపులులు ఉండవచ్చేమో అనే అనుమానం గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది.

గ్రామంలో చిరుతపులి మృతదేహం కనిపించడంతో, ప్రజలు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Veteran Telugu actress Pavala Shyamala passed away

Pavala Shyamala | టాలీవుడ్‌లో విషాదం.. నవ్వులు పంచిన నటి.. పావలా శ్యామల ఇకలేరు

తెలుగు సినీ పరిశ్రమ మరో సీనియర్ నటిని కోల్పోయింది. ఎన్నో చిత్రాల్లో తన సహజ నటన, హాస్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల(Pavala Shyamala...
- Advertisement -
Chat on WhatsApp