అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్‌తో ముగ్గురు చిన్నారుల మృతి

అనాథాశ్రమంలో విషాదం

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్  కారణంగా ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. 

నిన్న సమోసాలు తిన్న తర్వాత 27 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి, నర్సీపట్నంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. జాషువా (1వ తరగతి), భవాని, శ్రద్ధ (మూడో తరగతి) అనే ఈ చిన్నారుల మృతితో అనాథాశ్రమంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

కాగా, ఈ అనాథాశ్రమంలో మొత్తం 60 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. వారంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె.విజయ విచారణకు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *