ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) రానున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన సుమారు 400 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు.
అలాగే ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం విద్యార్థులకు ప్రత్యేక గౌరవంగా నిలవనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
అత్యున్నత స్థాయి వ్యక్తులు హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. వేదిక వద్ద భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విజయనగరంలో అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
400 మంది విద్యార్థులకు పట్టాలు.. విజయనగరంలో రాష్ట్రపతి పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
-








