Infosys: ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగాభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్కు విశాఖపట్నంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇన్ఫోసిస్ సంస్థ సుమారు రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, దీని ద్వారా రాష్ట్రంలో ఐటీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
ఈ కొత్త క్యాంపస్ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రారంభ దశలోనే సుమారు 7 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని సమాచారం. దీంతో నిరుద్యోగ యువతకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
అలాగే ఐటీ, ఐటీ ఈఎస్ రంగాలకు సంబంధించిన సేవలు, టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు, బిజినెస్ ప్రాసెస్ సేవలు విశాఖలో మరింత విస్తరించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థ రావడం రాష్ట్రానికి మరింత ప్రాధాన్యతను తీసుకువస్తోంది.
ఈ పెట్టుబడి ద్వారా విశాఖపట్నం భవిష్యత్తులో ప్రముఖ ఐటీ కేంద్రంగా ఎదగనుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలకు ఇది భారీ ఊతం ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.








