Vande Mataram Law: స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి భావాన్ని నింపిన వందేమాతరం గీతంపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వందేమాతరం గీతానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు. ఈ చట్టం ప్రకారం వందేమాతరం గీతాన్ని అవమానించడం, ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా హేళన చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో గీతాలాపన జరుగుతున్న సమయంలో క్రమశిక్షణ, గౌరవాన్ని పాటించేలా నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొంది.
జాతీయ గీతం జన గణ మనకు ఉన్న గౌరవ ప్రమాణాల మాదిరిగానే వందేమాతరం విషయంలోనూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. దేశ చరిత్ర, జాతీయ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ గీతానికి మరింత ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో కేంద్రం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ నిర్ణయానికి చట్టబద్ధత వచ్చింది. వందేమాతరం గీతం భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని, కొత్త నిర్ణయం జాతీయ ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: PM Narendra Modi | ఒక్క చేనేత వస్త్రం కొనండి.. నేతన్నలకు అండగా నిలవండి: ప్రధాని మోడీ








