Wednesday, August 5, 2026
Chat on WhatsApp
HomeTelanganaCheyutha Pension Scheme | అర్హులైన పేదలకు భరోసా.. ‘చేయూత’ పథకంతో కొత్త పింఛన్ల శ్రీకారం

Cheyutha Pension Scheme | అర్హులైన పేదలకు భరోసా.. ‘చేయూత’ పథకంతో కొత్త పింఛన్ల శ్రీకారం

-

Chat on WhatsApp

తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ‘చేయూత’ పింఛన్ల(Cheyutha Pension Scheme) పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆగస్టు 15న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు రెండున్నర లక్షల మంది అర్హులకు పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు, నిరుపేదలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు నెలవారీ ఆర్థిక సహాయం అందనుంది. అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు చేరేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ‘చేయూత’ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం కావడం లబ్ధిదారుల్లో ఆనందం నింపుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp