Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakనిజాంపేటలో వీఆర్ఏ వారసుల అరెస్ట్‌పై నిరసన

నిజాంపేటలో వీఆర్ఏ వారసుల అరెస్ట్‌పై నిరసన

-

Chat on WhatsApp

నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం వీఆర్ఏ వారసులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ గాంధీభవన్‌కు వెళ్తున్న క్రమంలో పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. ఈ అరెస్టులు అన్యాయమని వీఆర్ఏ వారసులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

వీఆర్ఏ వారసుల సమస్యలను పరిష్కరించాలని 61 మందికి పైగా వారు పోరాటం చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రభుత్వాన్ని అభ్యర్థించేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని, తమ డిమాండ్లపై సమాధానం చెప్పాలని పోలీసు అధికారులను ప్రశ్నించారు.

ఈ అక్రమ అరెస్టులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వీఆర్ఏలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో తమ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మరింత పెద్దఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు నవీన్, తాడెం తిరుపతి, భాస్కర్, అనిల్, అజీజ్ మియా తదితరులు పాల్గొన్నారు. పోలీసుల తీరును ఖండిస్తూ, త్వరలోనే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp