February 18, 2026
A1tv Telugu News
Madras High Court ruled that Tamil is mandatory for government jobs in Tamil Nadu, stating that officials must know the language to perform duties.
National.

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులకు తమిళ భాష రాయడం, చదవడం తప్పనిసరిగా నేర్చుకోవాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. ప్రజల మధ్య పనిచేయాల్సిన ఉద్యోగులకు స్థానిక భాష తెలియకపోతే, విధులను సమర్థవంతంగా నిర్వహించలేరని కోర్టు వ్యాఖ్యానించింది.

తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన జయకుమార్ అనే అభ్యర్థి, తమిళ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో ఉద్యోగం నుంచి తొలగించడంపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. తండ్రి నావికాదళంలో పనిచేయడం వల్ల తాను సీబీఎస్ఈ స్కూల్‌లో చదివానని, తమిళం నేర్చుకోవడానికి అవకాశం లేకపోయిందని కోర్టుకు వివరించాడు.

అయితే, మద్రాస్ హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు తమిళాన్ని నేర్చుకోవాలని, ఇది వారి ప్రాథమిక అర్హతలలో ఒకటిగా ఉండాల్సిందని కోర్టు స్పష్టం చేసింది. స్థానిక భాషను తెలుసుకోవడం ఉద్యోగంలో సమర్థత పెంచుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర అధికార భాషపై అవగాహన ఉండాలని కోర్టు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులు ముందుగా భాష నేర్చుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో భాషా నైపుణ్యం ప్రాముఖ్యతను గుర్తించాలని కోర్టు తీర్పు ద్వారా స్పష్టం చేసింది.

Related posts

Himanta Biswasarma | కాంగ్రెస్‌పై సీఎం హిమంత పరువునష్టం దావా

Bajaswamy

Nitish Kumar Oath Ceremony:నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేష్

Bajaswamy

ఢిల్లీలో కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగింది

admin

Leave a Comment