Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోసిగి మండలంలో శ్రీ సిద్ధరూడ స్వామి శతమానోత్సవం

కోసిగి మండలంలో శ్రీ సిద్ధరూడ స్వామి శతమానోత్సవం

-

Chat on WhatsApp

కోసిగా మండలంలోని శ్రీ సిద్ధరూడ స్వామి మహా చరిత్ర శతమానోత్సవం కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలోని మహాశివరాత్రి వేడుకలతో జరగింది. ఈ వేడుకలో 5000 మందికిపైగా భక్తులు హాజరై సద్వచనాలను వినడం జరిగింది. జగద్గురు శ్రీ సిద్ధరూడ స్వామి జయంతి ఉత్సవం సందర్బంగా చళాకాపురం నుండి బయలుదేరిన స్వామి, ఆంధ్ర, కర్ణాటక సిద్ధరూడ స్వామి మఠాలను సందర్శించి, శివరాత్రి రోజు హుబ్బళ్లి చేరుకున్నారు.

ఈ కార్యక్రమం కోసిగా మండలంలోని శ్రీ సిద్ధరూడ శాంతాశ్రమం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరగింది. కార్యక్రమంలో రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించడమూ, ఆడపడుచుల కలశాలతో డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఆరూఢ జ్యోతి రథయాత్ర నిర్వహించడం జరిగింది.

ఆరూఢ జ్యోతి రథయాత్రలో హజరైన భక్తులను శాలువాతో సన్మానించారు. ఉబ్బల్లి మఠం ట్రస్ట్ కమిటీ సభ్యులు మరియు కోసిగిలోని సిద్ధరూడ శాంతాశ్రమం ట్రస్ట్ సభ్యులు ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమంలో ఉమాకాంత్ కుమార్ దొర, పత్రాలు నరసింహులు, పూజారి అయ్యన్న గౌడ్, మూర్తి గౌడ్, ముకుంద కిష్టప్ప, వెంకటరెడ్డి, తిమ్మయ్య, తిరుమల, ఈ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని వేడుకను విజయవంతంగా నిర్వహించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp