Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshVisakhapatnam | మత్స్యకారుల జాడ కోసం నాలుగు రోజుల అన్వేషణ.. చివరికి?

Visakhapatnam | మత్స్యకారుల జాడ కోసం నాలుగు రోజుల అన్వేషణ.. చివరికి?

-

Chat on WhatsApp

Visakhapatnam: విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నాలుగు రోజుల పాటు నిరంతరంగా సాగిన అన్వేషణ అనంతరం ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌ను అధికారులు అధికారికంగా నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి గాలింపు చర్యలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

జూలై 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఏడుగురు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అనంతరం బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో సముద్రం ఉద్ధృతరూపం దాల్చింది. జూలై 4న వారి బోటు ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ఆరుగురు అలల్లో చిక్కుకుని గల్లంతయ్యారు.

సమాచారం అందిన వెంటనే నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు నౌకలు, ప్రత్యేక సాంకేతిక పరికరాలతో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సముద్రంలోని పలు ప్రాంతాలను జల్లెడ పట్టినా గల్లంతైన వారి జాడ మాత్రం కనిపించలేదు. దీంతో అన్ని అవకాశాలను పరిశీలించిన అనంతరం సెర్చ్ ఆపరేషన్‌ను ముగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమవారు క్షేమంగా తిరిగి వస్తారనే ఆశతో ఎదురుచూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మత్స్యకార గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. గల్లంతైన ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖ చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వ తరఫున అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇవ్వనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

harish rao announces padayatra over sangameshwara basaveshwara lift irrigation project

Harish Rao | ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తా: హరీష్ రావు కీలక ప్రకటన

సంగారెడ్డి జిల్లాలో నీటి సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రధాన అంశాలుగా తీసుకుని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంగమేశ్వర–బసవేశ్వర(Sangameshwara-Basaveshwara) ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి...
- Advertisement -
Chat on WhatsApp