Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeSportsShreyanka Patil | డిప్రెషన్‌లోకి వెళ్లా.. కానీ బుమ్రా ఇచ్చిన సలహాలే డిప్రెషన్‌ నుంచి బయటకు...

Shreyanka Patil | డిప్రెషన్‌లోకి వెళ్లా.. కానీ బుమ్రా ఇచ్చిన సలహాలే డిప్రెషన్‌ నుంచి బయటకు వచ్చా

-

Chat on WhatsApp

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రముఖ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్(Shreyanka Patil) తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టకాలాన్ని తాజాగా వివరించింది. గాయాల కారణంగా చాలా కాలం మైదానానికి దూరమైన ఆమె, ఆ సమయంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని భావోద్వేగంగా వెల్లడించింది. బొటనవేలు ఫ్రాక్చర్, మణికట్టు గాయాల కారణంగా శ్రేయాంక పాటిల్ 2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌తో పాటు ఐపీఎల్ 2025లో కూడా పాల్గొనలేకపోయింది. ఈ విరామం ఆమెకు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన ప్రభావం చూపిందని తెలిపింది. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

“గాయాల కారణంగా చాలా కష్టమైన రోజులు గడిపాను. ఒక దశలో క్రికెట్‌ను వదిలేయాలనే ఆలోచన కూడా వచ్చింది. కానీ నా మనసులో ఎప్పుడూ ఒక అంతర్గత శబ్దం వినిపించేది. నేను ఈ ఆటను ప్రేమిస్తున్నాను, తిరిగి మైదానంలోకి రావాలి అనే ఆలోచనే నన్ను నిలబెట్టింది” అని ఆమె పేర్కొంది. కుటుంబ సభ్యుల మద్దతు, ముఖ్యంగా తండ్రి ప్రోత్సాహం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని శ్రేయాంక వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ, గాయాల సమయంలో ఒంటరితనం ఎక్కువగా అనిపించిందని, మొదటి కొన్ని నెలలు ఎవ్వరితోనూ మాట్లాడకుండా గదిలోనే గడిపిన సందర్భాలు ఉన్నాయని చెప్పింది. అయితే రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, అమన్‌జ్యోత్ కౌర్ వంటి సహచరుల మద్దతు తనలో కొత్త ధైర్యాన్ని నింపిందని తెలిపింది.

అలాగే భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె గుర్తు చేసుకుంది. ఒత్తిడిలో బౌలింగ్ ఎలా చేయాలి, గాయాల తర్వాత మానసికంగా ఎలా బలపడాలి అనే విషయాల్లో బుమ్రా తనకు విలువైన సూచనలు ఇచ్చారని చెప్పింది. “క్రికెట్‌లో గాయాలు సహజం, వాటితో పోరాడకూడదు, అర్థం చేసుకోవాలి” అన్న ఆయన మాటలు తన దృక్పథాన్ని మార్చాయని శ్రేయాంక వెల్లడించింది.

ఇప్పుడు మళ్లీ మైదానంలోకి తిరిగి రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, ఎదురైన కష్టాలు తనను మరింత బలంగా మార్చాయని ఆమె భావోద్వేగంగా తెలిపింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp