Tuesday, July 21, 2026
Chat on WhatsApp
HomeNationalParliament Monsoon Sessions | నేటి నుంచి పార్లమెంట్ రణరంగం.. 19 రోజులపాటు హై వోల్టేజ్...

Parliament Monsoon Sessions | నేటి నుంచి పార్లమెంట్ రణరంగం.. 19 రోజులపాటు హై వోల్టేజ్ డ్రామా!

-

Chat on WhatsApp

Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 13 వరకు 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో కీలక బిల్లులతో పాటు పలు రాజకీయ అంశాలు సభలో ప్రధాన చర్చకు రానున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం శాసన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీయాలని నిర్ణయించింది. సమావేశాలకు ముందు ఉదయం పార్లమెంట్ భవనంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయి ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారం, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను సభలో ప్రస్తావించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇదే అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇటీవల పలువురు ఎంపీలు పార్టీలు మారిన ఘటనలను కూడా ప్రతిపక్షాలు సభలో లేవనెత్తనున్నాయి. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది.

మరోవైపు మంగళవారం జరిగే ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ ఎంపీలకు ప్రభుత్వ అజెండాపై దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వంటి కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో రాజకీయంగా ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

JP Nadda meeting CJP leaders in New Delhi

JP Nadda | జేపీ నడ్డాతో సీజేపీ నేతల భేటీ.. డిమాండ్లపై సానుకూల స్పందన?

JP Nadda: కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నాయకుల ప్రతినిధి బృందం సమావేశమై తమ ప్రధాన డిమాండ్లను వినిపించింది. చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు, ప్రభుత్వం తమ...
- Advertisement -
Chat on WhatsApp