KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో రాహుల్ తన కెరీర్లో 500 ఫోర్లు పూర్తి చేశాడు.
మ్యాచ్లో కొట్టిన నాలుగో బౌండరీతో ఈ ఘనత సాధించిన రాహుల్, ఐపీఎల్లో 500 ఫోర్లు నమోదు చేసిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 813 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, సురేష్ రైనా తదుపరి స్థానాల్లో ఉన్నారు. మొత్తం ఐపీఎల్ చరిత్రలో 500 ఫోర్లు పూర్తి చేసిన ఏడో ఆటగాడిగా రాహుల్ గుర్తింపు పొందాడు. విదేశీ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో ముందంజలో ఉన్నాడు.
2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్, ఇప్పటివరకు ఐదు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తూ లీగ్లో అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. తన ఐపీఎల్ కెరీర్లో 46కు పైగా సగటుతో 5,690 పరుగులు నమోదు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
138కు పైగా స్ట్రైక్ రేట్తో పాటు 500 ఫోర్లు, 232 సిక్సర్లు బాది లీగ్లో అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. రాహుల్ 23 పరుగులు మాత్రమే చేశాడు.








