Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeSportsIndia vs England | భారత్ vs ఇంగ్లాండ్ 2వ టీ20.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్ర...

India vs England | భారత్ vs ఇంగ్లాండ్ 2వ టీ20.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్ర అవకాశం?

-

Chat on WhatsApp

 India vs England: భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో గేమ్ మాంచెస్టర్‌లో నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 6 గంటలకు ఇరు జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి. తొలి మ్యాచ్ తర్వాత జట్టులో మార్పులు ఉంటాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి పడింది. ఇటీవల దేశీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతను చూపిన దూకుడు ఆటతీరు సెలెక్టర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండో టీ20లో అతనికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా చర్చ జరుగుతోంది. సంజు శాంసన్ స్థిరమైన ఫామ్ కనబరచలేకపోవడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. అలాగే తిలక్ వర్మ నెమ్మదైన బ్యాటింగ్ శైలి కూడా జట్టు వేగాన్ని ప్రభావితం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది.

ఒకవేళ సంజు శాంసన్‌కు విశ్రాంతి ఇస్తే, వికెట్ కీపింగ్ బాధ్యతలను ఇషాన్ కిషన్ నిర్వహించే అవకాశం ఉంది. అదే జరిగితే వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా అరంగేట్రం చేసే ఛాన్స్ కూడా ఉందని అంచనాలు ఉన్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు బలంగా మారింది. అయితే తుది జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తారా లేదా అనేది మ్యాచ్ ప్రారంభానికి ముందు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ram charan peddi ott release on netflix from july 9

Peddi OTT Release | ఓటీటీలోకి ‘పెద్ది’.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

Peddi OTT Release: థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా...
- Advertisement -
Chat on WhatsApp