Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeSportsKnight Riders Group | అమెరికాలో క్రికెట్ చరిత్ర సృష్టించిన నైట్ రైడర్స్.. లాస్ ఏంజెల్స్‌లో...

Knight Riders Group | అమెరికాలో క్రికెట్ చరిత్ర సృష్టించిన నైట్ రైడర్స్.. లాస్ ఏంజెల్స్‌లో కొత్త స్టేడియం

-

Chat on WhatsApp

అమెరికాలో క్రికెట్‌కు కొత్త దశను ప్రారంభిస్తూ నైట్ రైడర్స్ గ్రూప్(Knight Riders Group) చారిత్రక ఘనత సాధించింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సహ యాజమాన్యంలో ఉన్న ఈ ఫ్రాంచైజీ, లాస్ ఏంజెల్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ మ్యాచ్‌తో ఈ వేదిక అధికారికంగా ప్రారంభమైంది.

లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ స్టేడియం క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ ప్రారంభంతో అమెరికాలో ప్రొఫెషనల్ క్రికెట్ విస్తరణకు ఇది కీలక అడుగుగా నిలిచింది. నిర్వాహకుల ప్రకారం, దీర్ఘకాలికంగా అమెరికాలో క్రికెట్ అభివృద్ధి కోసం రూపొందించిన పెద్ద ప్రాజెక్టులో ఇది ముఖ్య భాగం. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ స్టేడియంలో ఎనిమిది పిచ్‌లు ఏర్పాటు చేయగా, ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా మైదానం డిజైన్ చేశారు. 120 అడుగుల ఎత్తులో ఆరు ఫ్లడ్‌లైట్స్, భారీ స్థాయిలో మట్టిని తరలించి సిద్ధం చేసిన గ్రౌండ్‌తో ఇది ప్రపంచ స్థాయి వేదికగా మారింది. ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా ఉత్తమ అనుభవం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న తమ కల ఈ ప్రాజెక్ట్‌తో నిజమైందని తెలిపారు. లాస్ ఏంజెల్స్‌లో క్రికెట్‌ను ఒక కుటుంబ వినోద కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ స్టేడియం రూపొందించామని చెప్పారు. నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ, ఇది కేవలం మైదానం మాత్రమే కాదని, క్రికెట్ భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.

ప్రారంభ మ్యాచ్‌లో ఎన్‌బీఏ దిగ్గజం మెట్టా వరల్డ్ పీస్ తొలి బంతి వేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జూలై 1 నుంచి జూలై 5 వరకు ఈ వేదికపై మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Delhi | ఢిల్లీ పోలీసుల భారీ ఆపరేషన్.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Delhi: జాతీయ రాజధాని ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో అనుబంధాలు కలిగిన అంతర్రాష్ట్ర ఆయుధాలు–ఉగ్ర ముఠాను పోలీసులు భగ్నం...
- Advertisement -
Chat on WhatsApp