Wednesday, August 5, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakనస్కల్ గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం

నస్కల్ గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం

-

Chat on WhatsApp

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో గురువారం కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి మండపం వరకు సింగిడి కేరళ బ్యాండ్ చే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో కులమతాలకు అతీతంగా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం విగ్రహాదాతగా కొండగారి స్వామి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు. నవరాత్రులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు కుంకుమార్చన, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు 9 రోజులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, లింగం గౌడ్, లక్ష్మ గౌడ్, ఎర్ర గౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, వేణు గౌడ్, వెంకటేష్ గౌడ్, కౌండిన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp