Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshస్వచ్ఛత హి సేవా ర్యాలీ... జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపు...

స్వచ్ఛత హి సేవా ర్యాలీ… జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపు…

-

Chat on WhatsApp

స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపు ఇచ్చారు.

బుధవారం, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక వై జంక్షన్ నుండి నందంగనిరాజు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించబడింది.

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా, కలెక్టర్ పి.ప్రశాంతి స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీని ప్రారంభించామని తెలిపారు.

సమాజం పరిశుభ్రంగా ఉంటే అభివృద్ధి మరియు ఆరోగ్యం సాధ్యమవుతుందని చెప్పారు.

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు లక్ష్యాలను నేరవేర్చడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp