Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న నిరసనలపై ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్( Khawaja Asif) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని భారత్తో సమానంగా చూస్తున్నామని, వారు కూడా పాకిస్థాన్కు శత్రువులేనని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనకారులతో చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేస్తూ, భద్రత దృష్ట్యా తీసుకున్న చర్యలను సమర్థించారు.
ఇటీవల PoKలో జరిగిన ఘటనల్లో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. శాంతియుత నిరసనలపై భద్రతా బలగాలు కాల్పులు జరపడం తప్పు కాదనే రీతిలో ఆయన స్పందించడంపై మానవ హక్కుల వర్గాలు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. PoK ప్రజలను భారత్తో పోల్చడం ద్వారా పాకిస్థాన్నే తమ వాదనను బలపరిచిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత ప్రజల అసంతృప్తిని పరిష్కరించకుండా, నిరసనలను అణిచివేసే ప్రయత్నం చేయడం పాకిస్థాన్ ప్రభుత్వ వైఖరిని మరోసారి బయటపెట్టిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.
ALSO READ: Bogatha Falls | వరద ఉద్ధృతితో బొగత జలపాతం మూసివేత.. ఎందుకంటే?








