Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeNationalSupreme Court | లైవ్ వీడియో ఉంటుంది.. కానీ ఆడియో ఉండదు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Supreme Court | లైవ్ వీడియో ఉంటుంది.. కానీ ఆడియో ఉండదు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

-

Chat on WhatsApp

Supreme Court: సుప్రీంకోర్టు వర్చువల్‌ విచారణ విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై అత్యవసర కేసులపై న్యాయవాదులు చేసే మెన్షనింగ్‌ సమయంలో జరిగే సంభాషణలు లైవ్‌ స్ట్రీమింగ్‌లో వినిపించవు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. లైవ్‌ వీడియో కొనసాగినప్పటికీ, సీజేఐ ఎదుట న్యాయవాదులు చేసే అభ్యర్థనలు, వాటిపై కోర్టు స్పందనలు ఆడియో రూపంలో ప్రసారం కావు. కేసుల అత్యవసర విచారణకు అనుమతి కోరే మెన్షనింగ్‌ ప్రక్రియను న్యాయపరమైన విచారణగా కాకుండా పరిపాలనా అంశంగా పరిగణించాలని కోర్టు గతంలో స్పష్టం చేసింది. అదే విధానాన్ని అమలు చేస్తూ తాజాగా ఆడియో మ్యూట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

“కొన్ని కీలక కేసుల్లో వాదనలు ప్రారంభం కాకముందు కోర్టు చేసిన మౌఖిక వ్యాఖ్యలు బయటకు రావడం, వాటిపై విస్తృత చర్చ జరగడం ఈ నిర్ణయానికి మరో కారణంగా భావిస్తున్నారు.” అసలు వాదనలు ప్రారంభం కాకముందే కోర్టు ప్రాథమిక అభిప్రాయాలు బయటకు వెళ్లడం వల్ల అపోహలు, అనవసర చర్చలు జరిగే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు సమాచారం. “మెన్షనింగ్‌ దశలో జరిగే చర్చలను బయటకు రాకుండా చూడటం ద్వారా, కేసు పరిపాలనా పరిశీలన దశకు మరియు అధికారిక న్యాయ విచారణ ప్రక్రియకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.” ఈ మార్పుపై ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ, కోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UN Security Council | భారతీయుల రక్షణే లక్ష్యం.. ఐరాసలో భారత్ సంచలన వ్యాఖ్యలు

UN Security Council: పశ్చిమాసియాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి పరిధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న...
- Advertisement -
Chat on WhatsApp