Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeInterNationalUN Security Council | "ముందు మీ దేశాన్ని చక్కదిద్దుకోండి"..  నీతులు చెప్పొద్దు, పాక్‌పై భారత్ ఫైర్

UN Security Council | “ముందు మీ దేశాన్ని చక్కదిద్దుకోండి”..  నీతులు చెప్పొద్దు, పాక్‌పై భారత్ ఫైర్

-

Chat on WhatsApp

UN Security Council: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ మరోసారి ఘాటుగా బదులిచ్చింది. అసంబద్ధ ఆరోపణలతో అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తగదని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా కొనసాగిస్తున్న దేశానికి ప్రపంచానికి నీతులు చెప్పే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశం వేరే అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ, పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ఐరాస వేదికను దుర్వినియోగం చేసిందని విమర్శించారు.

జమ్మూకశ్మీర్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, దీనిపై ఎలాంటి సందేహానికీ తావు లేదని హరీశ్ మరోసారి స్పష్టం చేశారు. కశ్మీర్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఏకైక అంశం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మాత్రమేనని పేర్కొన్నారు. అలాగే సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, నిజాయితీ ఉన్నప్పుడే ఒప్పందాలు సజావుగా కొనసాగుతాయని, ఒకవైపు సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు సహకారం కోరడం సరికాదని అన్నారు. భారత్‌పై ఆరోపణలు చేయడం కంటే, తమ దేశంలోని ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత, అంతర్గత సమస్యల పరిష్కారంపై పాకిస్థాన్ దృష్టి పెట్టాలని హరీశ్ సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Yuvraj Singh extends support to students amid nationwide protests over NEET paper leak controversy.

Yuvraj Singh | NEET వివాదంలో కొత్త ట్విస్ట్.. యువరాజ్ ఎంట్రీ

Yuvraj Singh: NEET ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతుండగా, పలువురు ప్రముఖులు...
- Advertisement -
Chat on WhatsApp