Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeNationalJaishankar | అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రికి హెచ్చరిక

Jaishankar | అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రికి హెచ్చరిక

-

Chat on WhatsApp

Jaishankar: ఒమన్ తీరానికి సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సంఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడి, వాణిజ్య నౌకలపై జరిగే ఇలాంటి ప్రాణాంతక దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చురుగ్గా స్పందించింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్‌ను రెండోసారి పిలిపించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సముద్రయాన భద్రతకు విఘాతం కలిగించే చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొంది.

హార్మూజ్ జలసంధి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ‘ఎంటీ సెటెబెల్లో’ అనే కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్‌కు నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొత్తం 24 మంది భారతీయ సిబ్బందిలో 21 మంది క్షేమంగా బయటపడగా, ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మృతులను డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాలా సురేష్‌గా గుర్తించారు.

ఈ ఘటనపై అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంఓ)తో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. నావికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని స్పష్టం చేశాయి.

మరోవైపు, ఆంక్షల అమలులో భాగంగానే చర్యలు చేపట్టినట్లు అమెరికా వివరణ ఇచ్చింది. అయితే భారత ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరిస్తూ, వాణిజ్య నౌకల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సమస్యల పరిష్కారానికి దౌత్యపరమైన మార్గాలనే అనుసరించాలని సూచించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp