Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradesh"విధ్వంసం నుంచి వికాసం వైపు… రాష్ట్రం కొత్త దిశగా!"

“విధ్వంసం నుంచి వికాసం వైపు… రాష్ట్రం కొత్త దిశగా!”

-

Chat on WhatsApp


ఏపీ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల విధ్వంస పాలన తర్వాత ఇప్పుడు వికాసం వైపు రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఒక్క ఏడాదిలోనే అభివృద్ధికి గుండెకాయలాంటివి వేసిందని స్పష్టం చేశారు. నారా లోకేష్ మాట్లాతడుతూ “రాష్ట్రాన్ని మళ్లీ పునఃనిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పూర్తిగా స్థంభించిపోయింది. కానీ ఇప్పుడు, టీడీపీ పాలనలో వికాసం కోసం తొలి అడుగులు వేయబడ్డాయి,” అని అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, పెట్టుబడిదారులు భయంతో వెనక్కు వెళ్లిపోయారని లోకేశ్ ఆరోపించారు. ఇప్పుడేం జరిగిపోతుందో అన్న భయాన్ని తొలగించి, పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించడం మొదలైందని పేర్కొన్నారు. ప్రజల ఆశల్ని నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ధృడంగా ముందుకెళ్తోందని లోకేశ్ చెప్పారు. విద్య, ఉపాధి, పారిశ్రామికతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు. లోకేశ్ వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ ప్రభుత్వం ఉంచిన దృక్పథాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఏడాదిలో మార్పు ప్రారంభమైందన్న ఆయన మాటలు, ప్రజల్లో నూతన ఆశలు రేకెత్తిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp