Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిడవలూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది

విడవలూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది

-

Chat on WhatsApp

విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 20 ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఘటన గ్రామస్తుల ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ మాఫియా నిరభ్యంతరంగా దందా సాగిస్తోంది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నంబర్ ప్లేట్లు లేకుండా, లైసెన్స్ లేని డ్రైవర్లతో మట్టిని అధిక వేగంతో తరలిస్తున్న మాఫియా పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. రోడ్డుపై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ ఇవే ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణాలో పట్టుబడ్డాయి. రెండు సార్లు విడవలూరు, అల్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనప్పటికీ, రాజకీయ ఒత్తిడితో ట్రాక్టర్లు విడిపించుకుని మాఫియా యథావిధిగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

ఇకనైనా సంబంధిత అధికారులు మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక మరింత రెచ్చిపోవడానికి వీలు కల్పిస్తారా? అనే ప్రశ్న స్థానికుల మదిలో తలెత్తుతోంది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

heavy rainfall causes floods and landslides in north indian states

Heavy Rains | భారీ వర్షాలకు ఉత్తరాది అతలాకుతలం.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్ ?

Heavy Rains: ఉత్తర భారత రాష్ట్రాలను భారీ వర్షాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి ప్రాణ నష్టం సంభవించింది. పలు...
- Advertisement -
Chat on WhatsApp