Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeInterNationalకిమ్ జోంగ్ ఉన్ సృష్టించిన ‘సూసైడ్ డ్రోన్

కిమ్ జోంగ్ ఉన్ సృష్టించిన ‘సూసైడ్ డ్రోన్

-

Chat on WhatsApp
Kim unveils new North Korea 'suicide drones' - World News

ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ ఉన్ చేతికి ‘సూసైడ్ డ్రోన్’ రూపంలో మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది. తాజాగా ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలతో ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. 

ఈ పరీక్షలో భాగంగా పంట పొలాల మధ్య ఉంచిన యుద్ధ ట్యాంకును సూసైడ్ డ్రోన్ ద్వంసం చేయడం ఫొటోలలో కనిపిస్తోంది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న ఓ డ్రోన్ గాల్లోకి లేవడం, వేగంగా దూసుకెళ్లి యుద్ధ ట్యాంకును ఢీ కొట్టడం, ఆపై భారీ పేలుడు చోటుచేసుకోవడం.. తదితర ఘటనలకు సంబంధించిన ఫొటోలు ఈ వీడియోలో ఉన్నాయి. 

మిగతా డ్రోన్లు లక్ష్యానికి నిర్దేశిత దూరంలో ఆగి క్షిపణి దాడి చేసి తిరిగొస్తాయి. అయితే, ఈ డ్రోన్ మాత్రం నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీ కొట్టి పేలిపోతుంది. తద్వారా అక్కడ భారీ విధ్వంసం జరుగుతుంది. 

భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉపరితలంలోని లక్ష్యాలను కూడా ఈ డ్రోన్లతో ఛేదించవచ్చని కిమ్ చెప్పారు. అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు, ఆత్మరక్షణ వ్యవస్థలను పరీశీలిస్తే డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. తాజా సూసైడ్ డ్రోన్లను పెద్ద ఎత్తున తయారుచేసి సైన్యానికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp