Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshKuppam | కుప్పంలో బంగారం ఉత్పత్తి చేస్తాం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Kuppam | కుప్పంలో బంగారం ఉత్పత్తి చేస్తాం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

-

Chat on WhatsApp

Kuppam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై మరోసారి తన దీర్ఘకాలిక విజన్‌ను వెల్లడించారు. శనివారం కుప్పంలో పర్యటించిన ఆయన, ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో కుప్పం పేరును “స్వర్ణ కుప్పం”గా నిలబెట్టేలా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

కుప్పంలో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, వ్యవసాయ రంగ బలోపేతం ద్వారా సంపద సృష్టించే వాతావరణాన్ని తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కుప్పంలోనే బంగారం ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా అన్వేషిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సభలో ఆసక్తిని రేకెత్తించాయి.

ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో రూ.9,320 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 30 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించినట్లు సీఎం వెల్లడించారు. రహదారులు, మౌలిక వసతులు, పారిశ్రామిక పార్కులు, తాగునీటి సదుపాయాలు, ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన పనులు ఇందులో భాగంగా ఉన్నాయని వివరించారు.

స్థానిక యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి మారాలని, కుప్పం నుంచే పారిశ్రామికవేత్తలు తయారుకావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అడిడాస్ సంస్థ రాకతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో కూడా మార్పులు అవసరమని పేర్కొన్న సీఎం, రైతులు సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచించారు. ముఖ్యంగా సెరికల్చర్ వంటి రంగాలపై దృష్టి పెడితే రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని తెలిపారు. అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం అన్ని రంగాల్లో కుప్పాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp