Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshశ్రీకాకుళంలో పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

శ్రీకాకుళంలో పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

-

Chat on WhatsApp

శ్రీకాకుళం మే 3 – ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ బి.వి. రవిశంకర్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, డా. జి.ఎన్. రావు, ప్రొఫెసర్ మజ్జి రామారావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచంలో 180 దేశాల్లో జరిపిన సర్వే ప్రకారం మీడియా స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారత్‌లో మీడియా స్వేచ్ఛ 182 శాతానికి పరిమితమైందని పేర్కొన్నారు. పక్క దేశమైన పాకిస్థాన్‌లోనూ ఇది 152 శాతం మాత్రమే ఉండడం ఆందోళన కలిగించేదని అభిప్రాయపడ్డారు.

పత్రికా స్వేచ్ఛకు చట్టపరమైన రక్షణలు అవసరమని, మీడియా ప్రతినిధులు పని చేసేందుకు భయాందోళనలు లేకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ క్షీణించడమే ప్రజాస్వామ్య బలహీనతకు సూచన అని, ఇది ప్రజల సమాచార హక్కును కూడా దెబ్బతీస్తుందని వివరించారు.

ఈ నేపథ్యంలో పౌర సమాజం, ప్రభుత్వ యంత్రాంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇటువంటి దినోత్సవాలు మీడియా ప్రతినిధులకు మద్దతు ఇవ్వడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని వారు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, మేధావులు, స్థానిక సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp