వల్లభనేని వంశీ రిమాండ్ ముగింపు, కోర్టు తీర్పుపై ఉత్కంఠ

Police seek 10-day custody of Vallabhaneni Vamsi in the kidnap case. Court verdict on remand extension awaited.

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రేపటితో ఆయన రిమాండ్ ముగుస్తుండటంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ పూర్తయింది, ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ అధికారులు వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది. సీఐడీ విచారణకు సిద్ధమవుతోంది.

ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో వంశీపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. వంశీకి కస్టడీ మంజూరు అయితే, అతడిపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *