Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవల్లభనేని వంశీ రిమాండ్ ముగింపు, కోర్టు తీర్పుపై ఉత్కంఠ

వల్లభనేని వంశీ రిమాండ్ ముగింపు, కోర్టు తీర్పుపై ఉత్కంఠ

-

Chat on WhatsApp

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రేపటితో ఆయన రిమాండ్ ముగుస్తుండటంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ పూర్తయింది, ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ అధికారులు వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది. సీఐడీ విచారణకు సిద్ధమవుతోంది.

ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో వంశీపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. వంశీకి కస్టడీ మంజూరు అయితే, అతడిపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp