Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమెంటాడ మండల ప్రత్యేక అధికారి గ్రామంలో పర్యటన

మెంటాడ మండల ప్రత్యేక అధికారి గ్రామంలో పర్యటన

-

Chat on WhatsApp

విజయనగరం జిల్లా మెంటాడ మండలం, కైలాం గ్రామంలో గురువారం మెంటాడ మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి ఇంటింటి సర్వే నిర్వహించి విద్యార్థులు తక్కువగా ఉండడానికి గల కారణాలను వెలికి తీయాలని ఆదేశించారు. అలాగే గ్రామంలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఓపి అధికంగా ఉండడం పట్ల వైద్యసేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని రేషన్ డిపో తెరవకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో వారికి అధికారులు మంజూరు అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహసిల్దార్ కోరాడ వెంకటరావు, ఎంపీడీవో త్రివిక్రమ రావు, ఎంపీటీసీ చప్ప సూర్య కుమారి, పంచాయతీ అధికారి విమల కుమారి,జనసేన పార్టీ అధ్యక్షుడు సబ్బవరపు రాజశేఖర్ ,టిడిపి నాయకులు కొరుపిల్లి చిన్నం నాయుడు, గ్రామ సీనియర్ నాయకులు గండి సింహాద్రి, హౌసింగ్ ఏఈ డేవిడ్, ఏపిఎం సత్యనారాయణ, ఏ పీ ఓ చిన్నప్పయ్య, ఎంఈఓ వర్మ, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

revanth reddy meets godrej agrovet officials over khammam oil palm project

Godrej Agrovet | ఆయిల్ పామ్ రంగంలో భారీ పెట్టుబడి.. ఖమ్మంలో ₹300 కోట్ల...

Godrej Agrovet: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ....
- Advertisement -
Chat on WhatsApp