RBI Lunch Break Rules:బ్యాంకుల్లో లంచ్ బ్రేక్ పేరుతో కౌంటర్లన్నీ మూసివేయడం చట్టబద్ధం కాదని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా సహకార బ్యాంకుల్లో భోజనానికి ఎలాంటి నిర్ణీత సమయం లేదని, లంచ్ బ్రేక్ కారణంగా కస్టమర్ల సేవలు నిలిచిపోవడానికి వీలులేదని నిబంధనలు చెబుతున్నాయి.
సిబ్బంది అందరూ ఒకేసారి భోజనానికి వెళ్లడం అనుమతించబడదు. రొటేషన్ పద్ధతిలో కనీసం ఒక ఉద్యోగి కౌంటర్ వద్ద ఉండి కస్టమర్లకు సేవలు అందించాల్సిందే.
ALSO READ:India vs South Africa 1st Test: బుమ్రా గర్జన – కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్
గతంలో బ్యాంకుల్లో లంచ్ బ్రేక్ నిబంధన ఉన్నప్పటికీ, ప్రస్తుతం అది రద్దు అయిందని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఒకవేళ ఏ బ్యాంక్ అయినా ‘లంచ్ బ్రేక్’ పేరుతో కౌంటర్లు మూసి కస్టమర్లను ఇబ్బంది పెడితే, వినియోగదారులు వెంటనే ఆర్బీఐ హెల్ప్లైన్ లేదా బ్యాంకింగ్ ఒంబడ్స్మన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఇది వారి హక్కు అని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది.
