Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeNationalRailway Update | శాతవాహన నుంచి గౌతమి వరకు పలు రైళ్లకు మార్పులు.. పూర్తి వివరాలు...

Railway Update | శాతవాహన నుంచి గౌతమి వరకు పలు రైళ్లకు మార్పులు.. పూర్తి వివరాలు ఇవే

-

Chat on WhatsApp

Railway Update: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. విజయవాడ-దువ్వాడ మార్గంలోని రాయనపాడు రైల్వే యార్డ్‌లో రీమోడలింగ్ పనులు చేపట్టడంతో, ఈ నెల 28వ తేదీ నుంచి మే 5 వరకు పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ పనుల ప్రభావంతో 20 రైళ్లు రద్దు, 10 రైళ్లు దారి మళ్లింపు, 2 రైళ్లు రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు.

మార్పులు చేసిన జాబితాలో శాతవాహన ఎక్స్‌ప్రెస్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్, అలాగే విజయవాడ-భద్రాచలం మెమూ, విజయవాడ-డోర్నకల్ మెమూ, విశాఖపట్నం-మహబూబ్‌నగర్, నాగావళి, నాందేడ్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ వంటి రైళ్లు ఉన్నాయి.

దీంతో ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లు, షెడ్యూల్‌లను పరిశీలించుకోవాలని సూచించారు.

ఇక వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించింది. ఎస్ఎంవీటీ బెంగళూరు-సంత్రాగాచి, శాంత్రాగాచి-బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు కంటోన్మెంట్-కలబురగి, కలబురగి-బెంగళూరు కంటోన్మెంట్, ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్, బీదర్-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణికులు బయలుదేరే ముందు అధికారిక రైల్వే ప్రకటనలను తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిదని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp