Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaవడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

-

Chat on WhatsApp

Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వచ్చే మూడు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని ఆయన హెచ్చరించారు.

ఎండలు, వడగాలుల పరిస్థితిపై మంత్రి నేడు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రాంతాల్లో మజ్జిగ, తాగునీరు, అలాగే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. వడదెబ్బ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

అలాగే వడదెబ్బ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎండ తీవ్రత పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరం లేకుండా మధ్యాహ్న వేళల్లో బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp