Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshభీమిలి అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా

భీమిలి అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా

-

Chat on WhatsApp

భీమిలి అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమందికి టోకెన్లు ఇస్తున్నారు, భోజనం నాణ్యత ఎలా ఉంది, ఏమైనా లోపాలున్నాయా వంటి వివరాలను నిర్వాహక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరితో పాటు కలిసి భోజనం చేశారు. భోజనం రుచి ఉందని, పరిసరాల పరిశుభ్రత కూడా బాగుందని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. భోజనం కోసం వచ్చిన వాళ్ళతో కొంత సేపు ముచ్చటించారు. అన్నా క్యాంటీన్ లో వడ్డిస్తున్న భోజనం పట్ల వారందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ లలో భోజనానికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదవాడికి రూ.5 కే కడుపు నిండా మంచి భోజనం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారందరూ ప్రశంసించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

assam rifles convoy attacked by militants in manipur ukhrul district

Assam | మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి.. అమరులైన ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు

Assam: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకోవడంతో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిలో ఇద్దరు జవాన్లు విధి నిర్వహణలో...
- Advertisement -
Chat on WhatsApp