Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTelanganaOil Palm Farmers | కేసీఆర్ హయాంలో అభివృద్ధి.. ఇప్పుడు నిర్లక్ష్యం: ఆయిల్‌పామ్ సాగుపై కేటీఆర్...

Oil Palm Farmers | కేసీఆర్ హయాంలో అభివృద్ధి.. ఇప్పుడు నిర్లక్ష్యం: ఆయిల్‌పామ్ సాగుపై కేటీఆర్ ఆగ్రహం

-

Chat on WhatsApp

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాకలో మంగళవారం పర్యటించిన కేటీఆర్, ఆయిల్‌పామ్ రైతుల(Oil Palm Farmers)ను కలిసి వారి సమస్యలు, సాగు పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, సాగు పరిస్థితులు, పంటకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఆయిల్‌పామ్ సాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని రైతులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించాలనే లక్ష్యంతో రైతులను ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. సాగునీటి సౌకర్యాల విస్తరణతో పాటు రైతులకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందించామని, విదేశాల నుంచి నాణ్యమైన మొక్కలు, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చామని కేటీఆర్ తెలిపారు.

దీంతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ రంగంపై తగిన దృష్టి సారించడం లేదని ఆయన ఆరోపించారు. గతంలో ప్రతిపాదించిన ఆయిల్‌పామ్ మిల్లులు, అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధి నిలిచిపోయిందని, దీని ప్రభావం రైతులపై పడుతోందని అన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు మళ్లీ ఊతమిచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, ఈ రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp