అమరావతి సెక్రటేరియట్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో 26 జిల్లాల ICDS PD లు, RJD లతో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారి అధ్యక్షతన సమావేశం. రాష్ట్రంలో చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి. అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందించాలి రాష్ట్రంలో ఉన్న అన్ని అంగనవాడీ సెంటర్లకు త్రాగునీరు మరియు మరుగుదొడ్లు నిమిత్తం 52 కోట్లు మంజూరు బాల్య వివాహాలు ఆపాలి.. బాలకార్మికులు మరియు రోడ్డు మీద బిక్షాటన అరికట్టి వారిని భద్రతగా చైల్డ్ హోమ్ లో పెట్టి చదివించి వారిని క్షేమంగా చూసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న 55వేల అంగన్వాడీల్లో హెల్ప్ లైన్ నెంబర్ మరియు పోలీస్ నెంబర్ తప్పక ఏర్పాటు చెయ్యాలి.








