Jitesh Sharma: భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ వికెట్కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్యాటింగ్ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను మిడిల్ ఆర్డర్లో ఆడే క్రమంలో, జట్టు టాప్ ఆర్డర్ త్వరగా ఔటవ్వాలని దేవుడిని ప్రార్థిస్తుంటానని ఆయన నవ్వుతూ తెలిపారు. జట్టు కష్టా సమయంలో క్రీజ్లోకి దిగితే పరిస్థితిని మార్చే అవకాశం లభిస్తుందని, అప్పుడు హీరోగా నిలిచే ఛాన్స్ ఉంటుందని అన్నారు.
ఒత్తిడి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని జితేశ్ వెల్లడించారు. సవాళ్లను స్వీకరించడం తనకు అలవాటని, జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేగంగా పరుగులు సాధించి మ్యాచ్ను మలుపుతిప్పాలని కోరుకుంటానని చెప్పారు.
క్లిష్ట సమయంలో జట్టును గెలుపు దిశగా నడిపించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీశాయి.
ALSO READ:Saudi Arabia | బర్డ్ ఫ్లూ భయంతో సౌదీ కీలక నిర్ణయం…40 దేశాలపై పౌల్ట్రీ నిషేధం








